పండగలతోనూ చంద్రబాబు రాజకీయాలు

Update: 2020-01-14 07:10 GMT

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. పండగలను కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేసే విధంగా అసెంబ్లీలో సీఎం జగన్‌ ప్రకటన చేయనున్నారని తెలిపారు. ప్రాంతీయ విభేదాలు తలెత్తకుండా.. 13 జిల్లాల్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే మూడు రాజధానుల ప్రతిపాదన చేశారు’అని ఎమ్మెల్యే రోజా తెలిపారు. అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని చిత్తశుద్ధి ఉంటే.. ఐదేళ్ల పాలనలో అన్నీ తాత్కాలిక నిర్మాణాలే ఎందుకు కట్టారని రోజా ప్రశ్నించారు.

రాజధాని నిర్మాణానికి అప్పుడే జోలె పట్టి, కేంద్ర ప్రభుత్వంతో పోరాడి నిధులు తేవాల్సిందని అన్నారు. నగరిలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆమెమీడియాతో మాట్లాడారు. సీఎం జగన్‌ రాజధానిని మారుస్తామని ఎప్పుడూ చెప్పలేదు. అమరావతితో పాటు ఇంకో రెండు రాజధానులు ఏర్పాడతాయని అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలు చాలా వెనుకబడి ఉన్నాయి. వాటిని కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఆలోచనల్ని ప్రజలు, చదువుకున్నవారు స్వాగతిస్తున్నారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, టీడీపీ నేతలు స్వాగతించడం లేదని విమర్శించారు.

 

 

 

Similar News