నూతన సంవత్సరం సందర్భంగా మెట్రో రైలు ప్రత్యేక సర్వీసులు అందించనుంది. డిసెంబర్ 31 అర్ధరాత్రి ఒంటి గంట వరకూ సర్వీసులు నడవనున్నారు. అంతే కాదు..న్యూ ఇయర్ ను పురస్కరించుకుని మద్యం సేవించిన వారికి కూడా మెట్రోలోకి అనుమతించున్నారు. అయితే ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ప్రయాణం చేయాలని హైదరాబాద్ మెట్రో రైల్ ఎం డీ ఎన్ వీ ఎస్ రెడ్డి సూచించారు.
అర్ధరాత్రి 1 వరకు అన్ని మెట్రోస్టేషన్ లలో అందుబాటులో సర్వీసులు ఉంటాయన్నారు. అదే సమయంలో డిసెంబర్ 31 రాత్రి 2 ప్రత్యేక ఎం ఎం టి ఎస్ రైళ్లు సర్వీసులు నడపనున్నారు. అర్ధరాత్రి 1 :30 వరకూ లింగంపల్లి నుండి ఫలక్ నామా వరకు ఎం ఎం టి ఎస్ రైల్ అందుబాటులో ఉండనుంది.