కెసీఆర్ ది మాయమాటల పాలన

Update: 2019-12-28 09:10 GMT

టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కెసీఆర్ ది మాయమాటల పాలన అని ఎద్దేవా చేశారు. ఆయన నియంత పోకడలకు త్వరలోనే అడ్డుకట్ట పడుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో ఒక్కొక్క్కరికి ఒక్కో రూలు ఉంటుందా? అని ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్ పార్టీకి అంతం లేదన్నారు.

సీఎం కేసీఆర్ పాలనలో సత్యాగ్రహానికి అనుమతి ఇవ్వకపోడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద వైఖరిని ఆయన ఆక్షేపించారు. గతంలో కాంగ్రెస్ పార్టీనే టీఆర్‌ఎస్‌ భవన్ ఇచ్చిందనే విషయాన్ని కేసీఆర్‌ మర్చిపోవద్దని అన్నారు. సత్యాగ్రహాన్ని అడ్డుకోవడం కుట్ర అని ఆరోపించారు.

 

 

Similar News