కెసీఆర్ మాటలకు భయపడొద్దు

Update: 2019-10-24 14:12 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ మాటలకు ఆర్టీసి కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని..ఉద్యోగులను తీసేసే అధికారం ఎవరికీ లేదని జెఏసీ ఛైర్మన్ అశ్వత్థామరెడ్డి వ్యాఖ్యానించారు. అంతిమ విజయం తమదే అన్నారు. శుక్రవారం నాడు అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ఎవరి జాగీరు కాదన్నారు. ఉద్యోగాలు తీసివేయటానికి తాము ఫామ్ హౌస్ లో పాలేర్లం కాదని వ్యాఖ్యానించారు. ఆర్టీసీలో యూనియన్లు అస్తిత్వం కోల్పోలేదన్నారు.

కేసీఆర్ కు ఎప్పుడు ఎన్నికల ధ్యాసే అని విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు దురంహకారానికి పరాకాష్ట. సీఎం కేసీఆర్ కార్మికుల ఆత్మహత్యలకు కారణమయ్యేలా మాట్లాడుతున్నారు. కేబినెట్ కూడా అవసరం లేకుండా మంత్రి, తాను ఆర్డర్ ఇస్తానంటున్నారు. నీ జాగీరా ఆర్టీసీ. ముఖ్యమంత్రిగా మీరిచ్చిన మాట మీద మీరు నిలబడరా? అని ప్రశ్నించారు.

 

Similar News