ద్రోణంరాజు శ్రీనివాస్ కు కీలక పదవి

Update: 2019-07-13 10:11 GMT

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కు కీలక పదవి ఇచ్చారు. అత్యంత కీలకమైన విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎండీఆర్‌ఏ) చైర్మన్‌గా ఆయన్ను నియమించారు ఈ మేరకు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ సౌత్‌ నుంచి పోటీ చేసిన ద్రోణంరాజు టీడీపీ అభ్యర్థిపై ఓటమిపాలైన విషయం తెలిసిందే. ద్రోణంరాజు శ్రీనివాస్‌ గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు నిర్వహించారు.

Similar News