మురళీమోహన్ కు చంద్రబాబుకు పరామర్శ

Update: 2019-06-03 10:08 GMT

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మురళీమోహన్ ను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం నాడు పరామర్శించారు. మురళీమోహన్ ఈ మధ్యే వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున‍్నరు. ఈ సందర్భంగా చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌ సోమవారం హైదరాబాద్‌లోని మురళీమోహన్‌ నివాసానికి వెళ్లారు. ఆయనను పరామర్శించి, క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. పూర్తిగా కోలుకునేంతవరకూ విశ్రాంతి తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

Similar News