ఇరవై వేల కోట్ల హవాలా డబ్బు పట్టివేత

Update: 2019-02-12 03:33 GMT

కలకలం. ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా ఇరవై వేల కోట్ల రూపాయలు. హవాలా డబ్బు పట్టివేత. ఐటి శాఖ ఆపరేషన్ లో ఈ డబ్బు వెలుగుచూసింది. దీంతో ఒక్కసారిగా అందరిలో కలకలం మొదలైంది. అయితే ఇదంతా ఎవరి డబ్బు..ఎవరి కోసం..ఎక్కడికి తరలిస్తున్నారు అన్న కోణంలో దర్యాప్తు జరగనుంది. న్యూఢిల్లీ కేంద్రంగా ఆదాయ పన్ను శాఖ అధికారులు ఈ విషయాలను వెల్లడించారు. గత కొన్ని వారాలుగా సాగించిన తనిఖీల్లో ఈ మొత్తం పట్టుబడినట్లు తెలిపారు. దొంగ బిల్లులకు సంబంధించిన ఓ గ్రూపునకు ఇందులో భాగస్వామ్యం ఉందని వెల్లడించారు.

 

Similar News