రామ్ చరణ్, కైరా అద్వానీ నటించిన ‘వినయ విధేయ రామ’ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా నిడివి 2.26 గంటలు ఉన్నట్లు సమాచారం. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా ఇదే కావటంతో ఆయన అభిమానులు ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు. మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ ఈ సినిమాను నిర్మించింది. ప్రపంచ వ్యాప్తంగా వినయ విధేమ రామ సినిమా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా గురించి రామ్చరణ్ మాట్లాడుతూ– ‘‘ఇందులో బ్యూటిఫుల్ అండ్ బ్యాలెన్డ్స్ క్యారెక్టర్ చేశాను. పూర్తి స్థాయి మాస్ ఫిల్మ్ లా ఉంటుంది. మంచి కుటుంబ కథా చిత్రం కూడా. సినిమాలో అజర్ బైజాన్ లొకేషన్స్ ను నేపాల్–బీహార్ సరిహద్దు ప్రాంతంలా చూపించాం. కియారా ఫైన్ ఆర్టిస్టు. ఆ అమ్మాయి కళ్లతో మంచి హావభావాలు పలికించగలదు.
మంచి డ్యాన్స్ పార్టనర్. ‘రామా లవ్స్ సీత’ సాంగ్ విజువల్గా హైలైట్గా ఉంటుంది. ప్రశాంత్, స్నేహ, వివేక్ ఒబెరాయ్గార్లతో పనిచేయడం నాకు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్లా అనిపించింది. లొకేషన్లో బాగా ఎంజాయ్ చేశాం. పెద్ద సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారారు దానయ్య. ఆయనతో చేస్తే మా హోమ్ బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్లో చేసినట్లే ఉంటుంది. బోయపాటి మంచి కన్విక్షన్తో సినిమా చేస్తారు’’ అన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి చెబుతూ– ‘‘ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా అనగానే సర్ప్రైజ్ కాలేదు. సెట్లో ఎలా ఉంటామని కూడా ఆలోచించలేదు. బయట మేం మంచి స్నేహితులం. అదే షూటింగ్లో కూడా ట్రాన్స్ ఫార్మ్ అయ్యింది. చాలా ఆనందంగా ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఎక్కువ రివీల్ చేయకూడదు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది’’ అని పేర్కొన్నారు.