తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గురువారం తనతోపాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి మహమూద్ అలీకి అత్యంత కీలకమైన హోం శాఖ బాధ్యతలు అప్పగించారు. గత కేబినెట్ లో ఆయన ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహమూద్ అలీకి హోం శాఖ అప్పగించటం కీలకంగా మారింది.
ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపునకు మైనారిటీలు పూర్తిగా సహకరించారు. దీంతో ఈ వర్గాన్ని మరింత అక్కున చేర్చుకునేందుకు వీలుగా ఆయనకు హోం శాఖ ఇఛ్చినట్లు భావిస్తున్నారు. గత మంత్రివర్గంలో హోం మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డిని ఈ సారి కేబినెట్ లోకి తీసుకోకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది.