రామ్ చరణ్ నిర్మాతగా..చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహరెడ్డి’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ మంగళవారం నాడు అట్టహాసంగా విడుదల చేసింది. చిరు పుట్టిన రోజు పురస్కరించుకుని ఈ టీజర్ ఒక్క రోజు ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ టీజర్ లో చారిత్రక కథను కళ్ళకు కట్టేలా కోటలు..సెట్టింగ్ లు..చిరంజీవి లుక్ కూడా అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. అందులో చిరంజీవి ‘యుద్ధం ఎవరదీ’ అంటూ ప్రశ్నించే డైలాగ్ ఉంది. టీజర్లో భారీ గ్రాఫిక్స్, చిరు గెటప్, సెట్స్ అన్నీ సినిమాలోని భారీతనాన్ని, రిచ్ లుక్ ను చూపించాయి. తొలి స్వాతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ నటిస్తున్న సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు.
దాదాపు 150 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ప్రచారం. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ తోపాటు జగపతి బాబు, సుధీప్, విజయ్ సేతుపతిలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. చిరు కు జోడీగా నయన తార కన్పించనున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత రీ ఎంట్రీ ఇఛ్చిన చిరు ఖైదీ నెంబర్ 150తోనూ సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు చారిత్రక సినిమాతో సైరాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నారు. టీజర్ కూడా అంచనాలకు అనుగుణంగానే ఉంది.
https://www.youtube.com/watch?v=NMRJTTMMmZw