అందరూ అలా మర్చిపోతున్నారు అనగానే మళ్ళీ శ్రీరెడ్డి ఓ కొత్త అంశంపై తెరపైకి వస్తున్నారు. ఇప్పుడు ఆమె మళ్ళీ అదే పనిచేశారు. ఈ సారి ప్రముఖ డ్యాన్స్ డైరక్టర్, హీరో లారెన్స్ ను వివాదంలోకి లాగారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు. ‘ఓ రోజు నేను నా స్నేహితుల ద్వారా లారెన్స్ మాస్టర్ని హైదరాబాద్లోని మాసబ్ట్యాంక్ గోల్కొండ హోటలో కలుసుకున్నాను. ఆ సమయంలో లారెన్స్ తనని రూమ్కి పిలిపించారు. అక్కడికి వెళ్లాకా రాఘవేంద్ర స్వామి ఫోటో, రుద్రాక్షలు చూసి నాకు చాలా అద్భుతం అనిపించింది. అనంతరం నెమ్మదిగా లారెన్స్ నాతో మాట్లాడడం మొదలు పెట్టారు.
నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చి.. కొత్తగా ఇక్కడికి వచ్చే చాలా మందికి, పేద పిల్లలకి సహాయం అందిస్తున్నానన్నారు. నాకు అది చాలా మంచిగా అనిపించింది. అ తరువాత లారెన్స్ తన నిజస్వరూపం చూపించారు. నా నడుముతో పాటు ఇతర శరీర భాగాలు చూపించమన్నాడు. నాతో అసభ్యంగా డ్యాన్స్ మూమెంట్స్ కూడా చేశాడు. అనతరం లారెన్స్ తనకు అవకాశం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. దీంతో లారెన్స్ తో కొంత కాలం పాటు స్నేహంగా ఉన్నాను. ఇందులో బెల్లంకొండ సురేష్ చివరికి విలన్ అయ్యారన్నారని’ శ్రీరెడ్డి తెలిపారు.