కెటీఆర్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Update: 2018-04-28 11:53 GMT

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి ఈ సారి తెలంగాణ ఐటి, మునిసిపల్ శాఖ మంత్రి కెటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘భరత్ అనే నేను’ సినిమా ప్రమోషన్ కోసం సమయం కేటాయిస్తారు కానీ..పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న కాస్టింగ్ కౌచ్ వంటి సమస్యల పరిష్కారం కోసం కొంత సమయం కేటాయించలేరా? అని ప్రశ్నింది. కెటీఆర్ కు మూడు, నాలుగు సార్లు ట్వీట్ చేశానని, ఆయన పీఏ మొబైల్ కు మెసేజ్ లు పెట్టినట్లు తెలిపారు. దయచేసి మా సమస్యలపై స్పందించండి అని శ్రీరెడ్డి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లను ఫేస్ బుక్ పేజీలోనూ పోస్ట్ చేశారు.

ఇవి ప్రస్తుతం వైరల్ గా మారాయి. గత కొన్ని రోజులుగా తమ సమస్యలను బయటపెడుతున్నా సినీ పెద్దలు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. 'కొన్ని నెలలుగా క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతున్నాం. మాకు న్యాయం కావాలి. మూవీకి సంబంధించిన పెద్ద కుటుంబాలు మా సమస్యలపై సరైన రీతిలో స్పందించడం లేదు. వారి నిర్ణయాలపై మేం సంతృప్తి చెండడం లేదు. తెలుగు మహిళలు, యువతులకు సినిమాలో ఆఫర్లు రావడం లేదు. మేం మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం.' అని పేర్కొన్నారు.

 

 

Similar News