నాకు ఏదైనా జరిగితే బాధ్యత సర్కారుదే

Update: 2018-03-13 15:11 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఆయన తన భద్రతకు సంబంధించి అకస్మాత్తుగా లేవనెత్తిన సందేహాలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. తనకు ఏదైనా జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన ఏపీ డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. మార్చి14న జరిగే జనసేన సభకు పోలీసుల ఏర్పాట్లు బాగున్నాయని చెబుతూనే...సభ తర్వాత కూడా తనకు భద్రత కల్పించాలని ఆయన తన లేఖలో కోరారు.

అయితే తాను భద్రత కోరేది ఏదో ప్రదర్శన కోసం కాదని...ప్రస్తుతం ఉన్న కుల ఉద్యమాలు, వర్గ పోరాటాలు, రాజకీయ అణచివేతల నడుమ తన భద్రత సున్నితమైన సామాజిక రాజకీయ సమస్యలతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. తన మీద ఏదైనా దాడి జరిగితే అది ప్రజా జీవితంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ తన లేఖలో పేర్కొన్నారు. గతంలో జరిగిన పలు సంఘటనలు దృష్టిలో పెట్టుకుని 14 తర్వాత కూడా తనకు భద్రత కొనసాగించాలని కోరారు.

 

 

Similar News