జియో 5జీ స్మార్ట్ ఫోన్ ధర ఐదు వేల లోపే!

Update: 2020-10-18 12:24 GMT

రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపనుందా?. అంటే ఔననే వార్తలు వస్తున్నాయి. 5జీ స్మార్ట్ ఫోన్ ను ఈ కంపెనీ ఏకంగా 2500 రూపాయల నుంచి 3000 రూపాయల ధరకే అందించేందుకు సిద్ధం అవుతోంది. మొత్తం మీద ఈ ఫోన్ ఐదు వేల రూపాయల లోపు ఉంటుందని కంపెనీ అధికారి ఒకరు స్పష్టం చేశారు. తొలుత ఐదు వేల లోపు ఫోన్ మార్కెట్లోకి తీసుకొచ్చి..తర్వాత దీన్ని 2500 రూపాయల నుంచి 3000 రూపాయల లోపు ధరకే వినియోగదారులకు అందించనున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం దేశంలో ఉన్న 30 కోట్ల 2జీ వినియోగదారులను టార్గెట్ చేసుకుని జియో ఈ దిశగా సాగుతోంది. ప్రస్తుతం దేశంలో 5జీ స్మార్ట్ ఫోన్ల కనీస ధరే 27000 రూపాయలు ఉంది. అలాంటిది రిలయన్స్ జియో 5000 రూపాయల తక్కువ ధరకు 5జీ స్మార్ట్ ఫోన్ తేవటం అంటే ఇది మార్కెట్లో పెద్ద సంచలనంగా మారటం ఖాయం. కొద్ది రోజుల క్రితం జరిగిన రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలోనూ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ భారత్ ను త్వరలోనే 2జీ ముక్త్ భారత్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News