మంత్రి పువ్వాడ అజయ్ కి కరోనా

Update: 2020-12-15 04:57 GMT

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సోమవారం నాడు చేయించుకున్న ఆర్ టీ పీసీఆర్ పరీక్షల్లో తనకు కోవిడ్ 19 పాజిటివ్ అని తేలిందన్నారు. 'నన్ను కలిసిన వారు, నాతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు దయచేసి కోవిడ్ పరీక్ష చేసుకోవాలని మనవి. అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు.

హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ నందు హోం ఐసోలాషన్ లో ఉన్నాను. మీ ప్రేమే నాకు అసలైన వైధ్యం. దయచేసి నాకు ఫోన్ చేయడానికీ, నన్ను కలుసుకోవడానికీ ప్రయత్నించకండి. నా హెల్త్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. మళ్ళీ యధావిధిగా మీ మధ్యకు వచ్చి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాను.' అని పోస్టు చేశారు.

Tags:    

Similar News