తెలంగాణ పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

Update: 2021-02-09 13:19 GMT

తెలంగాణలో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. కరోనా కారణంగా ఈ విద్యా సంవత్సరంలో భారీ మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విద్యా శాఖ మంగళవారం పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఏడాది పూర్తి విద్యా సంవత్సరం సాధ్యపడనందున కేవలం ఆరు పేపర్లకు మాత్రమే పరీక్షలు నిర్వహించనున్న టీఎస్‌ ఎస్‌ఎస్‌సీ బోర్డు వెల్లడించింది. మే 17 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. పరీక్షా సమయం ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు ఉంటుందని తెలిపింది.

ఇదీ షెడ్యూల్

మే 17న తెలుగు

మే 18న హిందీ

మే 19న ఇంగ్లీష్‌

మే 20న మ్యాథ్స్‌

మే 21న సైన్స్‌

మే 22న సోషల్‌ పరీక్షలు జరుగుతాయని ఎస్‌ఎస్‌సీ బోర్డు వెల్లడించింది.

Tags:    

Similar News