తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి వచ్చారు. ఆమెతో గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. గురువారం నాడు రాజ్ భవన్ లో నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, పరిమిత సంఖ్యలో న్యాయవాదులు హాజరయ్యారు.