తెలంగాణ లాక్ డౌన్ పొడిగింపు

Update: 2021-05-30 13:20 GMT

సడలింపులు ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ

రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్ డౌన్ ను మే31 నుంచి మరో పదిరోజుల పాటు కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి కెసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకే సడలింపులు ఉంటున్నాయి. అయితే కొత్తగా ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ సడలింపులు ఇచ్చారు.

పరిమిత స్థాయిలో ఆర్ధిక కార్యకలాపాలకు కూడా అనుమతిస్తున్నట్లు మంత్రి కెటీఆర్ ట్వీట్ చేశారు. మార్గదర్శకాలు త్వరలో జారీకానున్నాయి. మధ్యాహ్నం నుంచి ఉదయం ఆరు గంటల వరకూ లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయనున్నారు. అయితే సడలింపులు ఒంటి గంట వరకూ పొడిగించినా అక్కడ నుంచి బయటకు వెళ్లిన వారు ఇళ్ళకు చేరుకోవటానికి మరో గంట సమయం ఇచ్చారు. అంటే మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకూ అమలు చేయనున్నారు.

Tags:    

Similar News