కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో విద్యా సంస్థలు ప్రారంభించేందుకు తెలంగాణ సర్కారు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే జులై 1 నుంచి స్కూళ్ళు, కాలేజీలు ప్రారంభించాలని నిర్ణయించింది. తాజాగా తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 5 నుంచి 9 వరకు ఎంసెట్.. ఆగస్టు 3న ఈసెట్, ఆగస్టు 11-14 వరకు పీఈ సెట్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి.