తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కు కరోనా

Update: 2021-04-06 11:24 GMT

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కమార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఒకింత అసౌకర్యంగా ఉండటంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలిపారు. అయితే తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవన్నారు. అయినా సరే కొన్ని రోజుల పాటు అధికార విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

సీఎస్ సోమేష్ కుమార్ నిత్యం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా ఓ ఛానల్ లో థరణి పోర్టల్ కు సంబంధించిన అంశాలపై ప్రజలు లేవనెత్తిన సందేహాలకు కూడా సమాధానాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల తనను కలసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.

Tags:    

Similar News