విదేశాలకు వెళ్ళే విద్యార్ధులకు వ్యాక్సిన్

Update: 2021-05-30 13:41 GMT

తెలంగాణ నుంచి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే విద్యార్ధులకు వ్యాక్సినేషన్ లో ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది.. ఈ మేరకు ఆదివారం నాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి కెటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వ్యాక్సినేషన్ పూర్తయితే వారు సురక్షితంగా విదేశాలకు వెళ్ళొచ్చని అన్నారు.

దీనికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలోనే జారీ చేయనున్నారు. విద్యార్ధులకు వ్యాక్సినేషన్ విషయంలో జాప్యం జరగటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని మీడియాలో వార్తలు రావటంతో మంత్రివర్గంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు.

Tags:    

Similar News