పవన్ కళ్యాణ్...వైజయంతి మూవీస్ దిద్దు బాట!

Update: 2024-09-04 11:28 GMT

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ కు కూడా కోటి రూపాయల విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తొలుత ఆయన ఆంధ్ర ప్రదేశ్ కు మాత్రమే కోటి రూపాయలు ప్రకటించి..తెలంగాణ విషయంలో మౌనంగా ఉండిపోయారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో బుధవారం నాడు తెలంగాణ సీఎం సహాయ నిధికి కూడా కోటి రూపాయలు అందించనున్నట్లు వెల్లడించారు. దీంతో పాటు వరద ప్రభావిత గ్రామాలకు కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విరాళం అనౌన్స్ చేశారు. వరదలతో 400 గ్రామ పంచాయతీలు ముంపు బారిన పడ్డాయి.. ఒక్కో పంచాయతీకి రూ. లక్ష చొప్పున నేరుగా పంచాయతీ ఖాతాకు విరాళం పంపిస్తాను అన్నారు.

                                                         మొత్తం నాలుగు కోట్ల రూపాయలు ముంపు గ్రామ పంచాయతీలకు పంపించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వైజయంతి మూవీ కూడా తెలంగాణ కు 20 లక్షల రూపాయల సాయం ప్రకటించింది. ఈ సంస్థ కూడా తొలుత ఆంధ్ర ప్రదేశ్ కు మాత్రమే 25 లక్షల రూపాయల సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం నాడు కొత్తగా ప్రభాస్ రెండు కోట్ల రూపాయలు, చిరంజీవి కోటి రూపాయలు, అల్లు అర్జున్ కోటి రూపాయలు , రామ్ చరణ్ కోటి రూపాయల సాయం ప్రకటించారు రెండు రాష్ట్రాలకు కలిపి.

Tags:    

Similar News