హైదరాబాద్ లో ఒప్పో 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్

Update: 2020-12-22 10:54 GMT

చైనాకు చెందిన ప్రముఖ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఒప్పో హైదరాబాద్ లో దేశంలోనే తొలిసారి 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యాధునిక నూతన సాంకేతిక పరిజ్ణానం కోసం ఈ ల్యాబ్ కృషి చేస్తుందని తెలిపారు. దేశంలో 5జీ ఎకో సిస్టమ్ అభివృద్ధితోపాటు ఈ సేవలు ప్రారంభం అయ్యేందుకు వీలుగా సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొంది.

కెమెరా, పవర్అండ్ బ్యాటరీ, పనితీరులకు సంబంధించి మూడు ఫంక్షనల్ ల్యాబ్ లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. 5జీ టెక్నాలజీ అభివృద్ధి ఒప్పో ప్రధానంగా దృష్టి పెట్టిన అంశాల్లో ఒకటి అని ఒప్పో ఇండియా వైస్ ప్రెసిడెంట్ తస్లీమ్ అరిఫ్ వెల్లడించారు. భారత్ లో సాంకేతిక పరిధిని పెంచేందుకు తమ ఆర్ అండ్ బి కేంద్రం 24 గంటలు పనిచేస్తుందని తెలిపారు.

Tags:    

Similar News