మాస్క్ పెట్టుకోకపోతే వెయ్యి జరిమానా

Update: 2021-04-11 11:10 GMT

తెలంగాణ సర్కార్ రాష్ట్రంలో మాస్క్ ను తప్పనిసరి చేస్తూ జీవో జారీచేసింది. ఎవరైనా ఈ నిబంధన ఉల్లంఘిస్తే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నుంచి ఈ నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి.

Tags:    

Similar News