శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం..బుల్లెట్లు

Update: 2021-03-03 04:52 GMT

బంగారం. బుల్లెట్లు. శంషాబాద్ విమానాశ్రయం బుధవారం ఉదయమే వార్తల్లోకి ఎక్కింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడు బంగారాన్ని కరిగించి పేస్టులాగా మార్చి తీసుకురాగా..కస్టమ్స్ అధికారులు గుర్తించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని పోలీసులకు అప్పగించారు.

ఇదిలా ఉంటే విమానాశ్రయంలో బుధవారం ఉదయమే బుల్లెట్లు దొరకటం కలకలం రేపింది. అమెరికా వెళ్ళే ప్రయాణికుల బ్యాగులు తనిఖీ సమయంలో బుల్లెట్లు బయటపడ్డాయి. ఓ దంపతుల బ్యాగులో ఇవి వెలుగు చూశాయి. వీరు గుంటూరు జిల్లా గురజాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరిని కూడా విచారణ కోసం శంషాబాద్ పోలీసులకు అప్పగించారు.

Tags:    

Similar News