
రెనాల్ట్ కార్ల విక్రయానికి సంబంధించి తెలంగాణలో కొత్త ఐదు షోరూమ్ లు అందుబాటులోకి వచ్చాయి. దేశంలో అతి పెద్ద ఆటోమొబైల్ రిటైలర్లలో ఒకరైన పీపీఎస్ మోటార్స్ తమ డీలర్షిప్ నెట్వర్క్ ను విస్తరించింది. ఈ సంస్థ కొత్తగా ఎల్బీ నగర్, కొంపల్లి, మలక్పేట, వరంగల్, నిజామాబాద్లలో షోరూమ్ లను తెరిచింది. నూతన రెనాల్ట్ కిగర్ ధర 5.45 లక్షల రూపాయలు. హైదరాబాద్లో నూతన షోరూమ్ ప్రారంభం సందర్భంగా దీనిని ఆవిష్కరించారు. రెనాల్ట్ కిగర్ వాహనాన్ని 1.0 లీటర్ ఎనర్జీ మరియు 1.0 లీటర్ టర్బో –మాన్యువల్, ఆటోమేటిక్ అవకాశాలలో అందిస్తున్నారు. రెనాల్ట్ కిగర్ ఇప్పుడు ఆరు బాడీ కలర్స్ లో అత్యద్భుతమైన డ్యూయల్టోన్ కాంబినేషన్లో లభిస్తుంది. ఇది నాలుగు ట్రిమ్స్– ఆర్ఎక్స్ఈ, ఆర్ఎక్స్ ఎల్, ఆర్ఎక్స్ టీ, ఆర్ఎక్స్ జెడ్లో లభిస్తుంది. ఎల్ఈడీ డీఆర్ఎల్, సీ ఆకృతి సిగ్నేచర్ ఎల్ఈడీ టైల్ ల్యాంప్స్,40.64 సెంటీమీటర్ వీల్స్, రూఫ్ రైల్ బార్స్, డ్యూయల్ టోన్ అవకాశాలు అన్ని ట్రిమ్స్ లో లభ్యమవుతాయని తెలిపారు.
నూతన రెనాల్ట్ కిగర్ వాహనాలను అన్ని పీపీఎస్ రెనాల్ట్ షోరూమ్ల వల్ల వినియోగదారులు టెస్ట్ డ్రైవ్ చేయవచ్చు. దీనితో పాటుగా 11వేల రూపాయలు చెల్లించి దీనిని బుక్ చేసుకోవచ్చు. నూతన రెనాల్ట్ కిగర్ డెలివరీలు మార్చి03,2021వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. నూతన షోరూమ్ ల ప్రారంభోత్సవం సందర్భంగా రాజీవ్ సంఘ్వీ, మేనేజింగ్ డైరెక్టర్, పీపీఎస్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాట్లాడుతూ ''రెనాల్ట్ ఇండియాతో భాగస్వామ్యం బలోపేతం చేసుకోవడం పట్ల ఆనందంగా ఉన్నాం. తెలంగాణాలో మా ఉనికిని మరింతగా విస్తరించాం. అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఎస్యువీ రెనాల్ట్ కిగర్ను ఆవిష్కరించడం పట్ల సంతోషంగా ఉన్నామన్నారు. .