కరోనా నుంచి కోలుకున్న సీఎం కెసీఆర్

Update: 2021-04-28 15:50 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. కోవిడ్ బారినపడినప్పటి నుంచి ఆయన ఫాంహౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా ఆయనకు డాక్టర్ ఎం వీ రావు పరీక్షలు నిర్వహించారు. ర్యాపిడ్ టెస్ట్ లో కెసీఆర్ కు నెగిటివ్ వచ్చిందని సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. అదే సమయంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు కూడా జరిపారు. దీనికి సంబంధించిన ఫలితాలు గురువారం నాడు రానున్నాయి.

కొద్ది రోజుల క్రితం సోమాజీగూడలోని యశోదా ఆస్పత్రిలో నిర్వహించిన టెస్ట్ ల్లోనూ ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తేల్చిన విషయం తెలిసిందే. ఆర్టీపీసీఆర్ ఫలితాలు కూడా వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో తన విధుల్లో పాల్గొనే అవకాశం ఉంది.

Tags:    

Similar News