యశోదా ఆస్పత్రికి కెసీఆర్

Update: 2021-04-21 14:26 GMT

కరోనా బారిన పడిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ను సోమాజీగూడ ఆస్పత్రికి రానున్నారు. ఆయనకు స్వల్ప లక్షణాలే ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. అయినా చెస్ట్ సిటీ స్కాన్ కోసం ఫాం హౌస్ నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నారు. తాజాగా వెల్లడైన ఆర్ పీసీఆర్ టెస్ట్ ల్లోనూ కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

అయితే సీటీ స్కాన్ లో అయితే వైరస్ వ్యాప్తి ఎంత ఉంది అన్నది మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో కెసీఆర్ యశోదాకు రానున్నారు. సీటీ స్కాన్ తో పాటు మరికొన్ని పరీక్షలు చేయించుకోనున్నారు.

Tags:    

Similar News