భూమా అఖిలప్రియకు బెయిల్

Update: 2021-01-22 13:17 GMT

మాజీ మంత్రి భూమా అఖిల్ ప్రియకు సికింద్రాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హఫీజ్ పేట భూ వివాదానికి సంబంధించి జరిగిన బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఆమె ఏ1గా ఉన్నారు. ఆమెను పోలీసులు కొద్ది రోజులు కస్టడీలోకి తీసుకుని ఈ కిడ్నాప్ కు సంబంధించిన వివరాలు సేకరించారు.

పోలీసులు భూమా అఖిలప్రియ బెయిల్ పిటీషన్ ను వ్యతిరేకించినా కూడా కోర్టు షరతులతో ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆమె శనివారం నాడు విడుదల అయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో ఆమె భర్త భార్గవ్ రామ్ బెయిల్ పిటీషన్ ను కోర్టు తోసిపుచ్చింది.

Tags:    

Similar News