పరీక్షల అనంతరం ఫామ్ హౌస్ కు కెసీఆర్

Update: 2021-04-21 15:55 GMT

ముఖ్యమంత్రి కెసీఆర్ కు బుదవారం రాత్రి సోమాజీగూడ యశోదా ఆస్పత్రిలో పలు రకాల పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా సీటీ స్కాన్ తో పాటు డాక్టర్ల సూచన మేరకు కొన్ని రక్త పరీక్షలు కూడా చేశారు. ఈ పరీక్షల అనంతరం సీఎం కెసీఆర్ వెంటనే ఫాంహౌస్ కు బయలుదేరి వెళ్ళారు. అయితే సీటీ స్కాన్ లో ఎలాంటి సమస్యలు గుర్తించలేదని..అంతా నార్మల్ గానే ఉందని డాక్టర్ ఎం వీ రావు వెల్లడించారు.

అయితే రక్తపరీక్షల రిపోర్టులు మాత్రం గురువారం నాడు వస్తాయన్నారు. కెసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని..త్వరలోనే ఆయన కోలుకుంటారని తెలిపారు. ఈ నెల 19న సీఎం కెసీఆర్ కు కరోనా సోకినట్లు తేలిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఫాంహౌస్ లో ఐసోలేషన్ లో ఉన్నారు.

Tags:    

Similar News