శ్రీశైలం ప్రమాదంపై మోడీకి రేవంత్ రెడ్డి లేఖ

Update: 2020-08-31 08:59 GMT

శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు ప్రమాదంపై సీబీఐతోపాటు సెంట్రల్ ఎలక్ట్రిసిటి అథారిటీ (సీఈఏ)తో శాఖపరమైన విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం నాడు ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. ‘ఈ సంఘటనలో క్రిమినల్ కోణం ఉంది. వందల కోట్ల నష్టం వాటిల్లింది. ఇక్కడ ప్రమాదం జరగడం వల్ల కొందరికి లాభం జరుగుతుంది. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు వస్తాయి.

అనుభవం లేని రిటైర్ అయిన ప్రభాకర్ రావు ను ఎండీ గా ఉండడం వల్ల జెన్ కో, ట్రాన్స్ కో సంస్థలు నష్టాల్లో కూరుకపోయాయి. ప్రభాకర్ రావు హయాంలో ఇచ్చిన టెండర్లు, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరపాలి. శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో ప్రమాదం వల్ల బయట ప్రైవేట్ వ్యక్తులకు లాభం జరుగుతుంది. బయట ఎవరిదగ్గర నుంచి విద్యుత్ కొంటున్నారో ప్రజలకు చెప్పాలి.’ అని డిమాండ్ చేశారు.

Similar News