ఆస్పత్రిలో చేరిన సోనియాగాంధీ

Update: 2020-07-30 15:42 GMT

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ గురువారం నాడు న్యూఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని.. సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తం తమ ఆస్పత్రిలో చేరినట్టు హాస్పిటల్‌ చైర్మన్‌ డీఎస్‌ రానా తెలిపారు. ఆమె గురువారం ఉదయం కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులతో వర్చువల్‌ మీటింగ్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలు, కరోనా పరిస్థితిపై సోనియా వారితో చర్చించారు.

Similar News