ఎవరు అబద్ధం చెబుతున్నారు..రాహుల్

Update: 2020-07-03 13:36 GMT

ప్రధాని నరేంద్రమోడీ లద్దాఖ్ పర్యటనపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ఆయన ఓ వీడియోను విడుదల చేసి మోడీకి ప్రశ్నలు సంధించారు. ఆ వీడియోలో లద్దాక్ ప్రజలు చైనా భారత భూ భాగాన్ని ఆక్రమించుకుందని చెబుతున్నారు. కానీ ప్రధాని మోడీ మాత్రం మన భూమిని ఎవరూ తీసుకోలేరు అని అంటున్నారు.

ఖచ్చితంగా ఎవరో ఒకరు అబద్దం చెబుతున్నారు అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. రాహుల్ విడుదల చేసిన వీడియోలో కొందరు లద్దాఖ్ ప్రజలు ఈ ప్రాంతంలో చైనా దూకుడును వివరించగా.. మరి కొందరు చైనా చట్టవిరుద్ధంగా మన భూమిని ఆక్రమించుకున్నారని చెప్పడం వీడియోలో చూడవచ్చు.

https://www.facebook.com/rahulgandhi/videos/628039461142324/

Similar News