మనబాబు కోసం ఎంతకైనా...!

Update: 2020-06-10 10:31 GMT

ప్రముఖ నటుడు, జనసేన నాయకుడు నాగబాబు తాజాగా మీడియాపై విమర్శలు చేశారు. ఆయన తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా పలు అంశాలు ప్రస్తావించారు. ‘టీడీపీ జెండాని..అజెండాని మోస్తున్న కొన్ని తెలుగు వార్తా ఛానల్స్ చూస్తుంటే మచ్చటేస్తుంది. టీడీపీ పార్టీ ఉప్పు తిన్న విశ్వాసాన్ని, టీడీపీ పట్ల వాళ్లకున్న అనురాగం, మనవాడు చంద్రబాబునాయుడు అన్న అభిమానం’ కన్పిస్తోంది. మన చంద్రబాబు కోసం కోసం ఎంతకైనా తెగించే సాహసం, మన బాబుకు ఉపయోగపడినంత కాలం ఓడ మల్లయ్య అని,బాబోరి తప్పుల్ని ఎత్తిచూపిస్తే బోడి మల్లయ్య అంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులను చక్కగా విమర్శిస్తూ బాబోరి ప్రయోజనాలను కాపాడే రక్షణ కవచాలుగా వారు చూపిస్తున్న తెగువ మెచ్చుకోవాల్సిందే. బాబుకు దగ్గరగా ఉండే బాబులను కూడా ముద్దు చేసే వారి మమతానురాగాలు వావ్..ఇది అసలైన వార్తా పత్రికల స్పిరిట్ అంటే...శభాష్ ’ అని పేర్కొన్నారు. అంతే కాదు..చివరగా ఓ ఆసక్తికర ముక్తాయింపు ఇఛ్చారు కూడా. ఒక్కోసారి జగన్మోహన్ రెడ్డే వీళ్ళకు కరెక్ట్ అన్పిస్తుంది.

 

Similar News