నాథూరాం గాడ్సే దేశభక్తుడు

Update: 2020-05-19 13:05 GMT

సినీ నటుడు, జనసేన నేత నాగబాబు చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ఆయన తాజాగా గాంధీని హత్యచేసిన నాధూరాం గాడ్సేను నిజమైన దేశభక్తుడు అంటూ వ్యాఖ్యానించారు. నాగబాబు ట్వీట్ యదాతధంగా...‘ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు.నిజమైన దేశ భక్తుడు. గాంధీ ని చంపడం కరెక్టా కదా అనేది డిబేటబుల్. కానీ అతని వైపు ఆర్గుఎమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు.

కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది.(ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే).గాంధీ ని చంపితే ఆపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు.కానీ నాధురాం దేశభక్తి ని శంకించలేము.ఆయన ఒక నిజమైన దేశభక్తుడు.ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తుచేసుకోవలనిపించింది.పాపం నాధురాం గాడ్సే...మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్.’ అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Similar News