ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండవ పెళ్లి చేసుకున్నారు. ఆయన ఆదివారం నాడు తన పెళ్లికి సంబంధించి సోషల్ మీడియా ద్వారా స్పష్టమైన సంకేతాలు ఇఛ్చారు. అన్నట్లుగానే ఆదివారం రాత్రి నిజామాబాద్ లోని వెంకటేశ్వరస్వామి దేవాలయంలో వీరి పెళ్లి జరిగింది.
లాక్ డౌన్ అమలులో ఉండటంతో కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్యే ఈ పెళ్ళి నిరాండంబరంగా సాగింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోమవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దిల్ రాజు మొదటి భార్య 2017లో మణించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఇప్పుడు రెండో పెళ్ళి చేసుకున్నారు.