మే 31 వరకూ లాక్ డౌన్..ప్రకటించిన కేంద్రం

Update: 2020-05-17 11:41 GMT

ఊహించినట్లుగానే కేంద్రం మరోసారి లాక్ డౌన్ ను పొడిగించింది. ప్రధాని నరేంద్రమోడీ ఇఫ్పటికే ఈ అంశంపై చాలా స్పష్టత ఇఛ్చారు. అందుకు అనుగుణంగానే మే 31 వరకూ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగించారు. దీంతో కొత్తగా దేశమంతా మరో 14 రోజులు లాక్ డౌన్ లోకి వెళ్లనుంది. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో కేంద్రం లాక్ డౌన్ కే మొగ్గుచూపింది. అయితే సడలింపులు మాత్రం కాస్త ఎక్కువగా ఉండబోతున్నాయి. అయితే గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్లలో పూర్తి స్థాయి కార్యకలాపాలకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది.

Similar News