రాష్ట్రం దివాళా తీయాలన్నది టీడీపీ కోరిక

Update: 2020-05-04 13:19 GMT

తెలుగుదేశం నేతలపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మద్యం ధరల పెంపును ఆయన సమర్ధించారు. పెరిగిన ఆదాయం రాష్ట్రానికే వస్తుంది కదా అని ప్రశ్నించారు. రాష్ట్రం దివాళా తీయాలన్నది టీడీపీ నేతల ఆలోచన అని మండిపడ్డారు. మద్యం విక్రయాలను తగ్గించేందుకే ధరలు పెంచామని మంత్రి తెలిపారు. సోమవారం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు ఏం సాధించాలని ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

చంద్రబాబు,యనమల కలసి రాష్ట్రాన్ని దివాళా తీసేలా చేశారని విమర్శించారు. కరోనా కష్టకాలంలో ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. కమీషన్లు కోసం కక్కుర్తి పడటం టీడీపీ నేతల బుద్ధి అని ధ్వజమెత్తారు. మద్యం తాగేవారిని తగ్గించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజల యోగక్షేమాలు టీడీపీ నేతలకు అవసరం లేదా అని మంత్రి బొత్స ప్రశ్నించారు.

 

Similar News