ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తన వంతుగా కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలను విరాళంగా అందిస్తున్నట్టు ప్రకటించారు. 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం సహయనిధికి, మరో 50 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి అందజేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ కార్మికుల సహాయార్థం 25 లక్షల రూపాయల చెక్ను కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఎగ్జిక్యూటివ్ మెంబర్ సీ కళ్యాణ్కు అందించారు. ఈ సందర్భంగా స్వీయ నిర్బంధంతో ఇంట్లోనే ఉండి కరోనా విపత్తును ధైర్యంగా ఎదుర్కోవాలని, వైరస్ను అరికట్టడంలో ప్రజలంతా భాగంగా కావాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు.