రామ్ చరణ్ 70 లక్షల విరాళం

Update: 2020-03-26 06:34 GMT

ప్రముఖ హీరో రామ్ చరణ్ కరోనాపై పోరుకు 70 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ తో స్పూర్తి పొంది తాను ఈ మొత్తం విరాళంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు. 70 లక్షల రూపాయలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లతోపాటు ప్రధాని సహాయ నిధికి కూడా అందించనున్నట్లు తెలిపారు. అయితే ఎక్కడ ఎంత ఇవ్వనున్నారనే అంశంపై మాత్రం రామ్ చరణ్ తన నోట్ లో క్లారిటీ ఇవ్వలేదు.

ఈ సంక్షోభ సమయంలో ప్రజలను ఆదుకోవటానికి తన వంతు సాయంగా ఈ మొత్తం అందజేయనున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీతోపాటు తెలుగు రాష్టాలైన ముఖ్యమంత్రులైన కెసీఆర్, జగన్మోహన్ రెడ్డిలు కరోనా నియంత్రణకు పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నారని కొనియాడారు. బాధ్యత గల పౌరుడిగా అందరూ ప్రభుత్వ నియమ, నిబంధనలు పాటించేందుకు ప్రోత్సహిస్తానని పేర్కొన్నారు.

 

Similar News