అందరూ ఊహించినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం ఫిబ్రవరి14న కాదు..16న అని తేలిపోయింది. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఈ కార్యక్రమం జరుగనుంది. తొలుత ఫిబ్రవరి 14న కేజ్రీవాల్ సీఎంగా ప్రమాణం స్వీకారం చేయనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
2015 అసెంబ్లీ ఎన్నికల్లో 67 సీట్లతో విజయఢంకా మోగించిన కేజ్రీవాల్ ఫిబ్రవరి 14న ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీ 62 సీట్లలో జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. బీజేపీని 8 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.. ఈ ఎన్నికల్లో ఆప్కు 53.57%, బీజేపీకి 38.51%, కాంగ్రెస్కు 4.26% ఓట్లు వచ్చాయి.