అనసూయపై అభ్యంతరకర వ్యాఖ్యలు..ఫిర్యాదు

Update: 2020-02-10 11:22 GMT

సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలకు వేధింపులు తప్పటం లేదు. సినిమా, టీవీ నటుల నుంచి మొదలుకుని మహిళా రాజకీయ నేతలూ ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా అనసూయపై కొంత అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. ‘యాక్టర్స్ మసాలా’ అన్న పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతా నుంచి ప్రముఖ నటుడు నాగార్జునతోపాటు అనుష్క, అనసూయలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన అనసూయ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ట్విటర్‌ వేదికగా ఫిర్యాదు చేశారు. అనసూయ ఫిర్యాదుపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు స్పందించారు. అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొందరు వ్యక్తులు శృతిమించుతూ చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలకు స్పందించపోతే సహనానికి అర్థం ఉండదని అనసూయ ట్వీట్‌ చేశారు. తనపై చేసిన వ్యాఖ్యలకు తాను సిగ్గు పడడం లేదని సరైన వ్యవస్థలు చర్యలు తీసుకోవాలని ట్వీటర్‌లో పేర్కొన్నారు.

 

 

Similar News