పవన్ కాశ్మీర్ పార్టీలతోనూ పొత్తు పెట్టుకోవచ్చు

Update: 2020-01-18 05:10 GMT

బిజెపి, జనసేనల పొత్తు వ్యవహారాన్నితెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కావాలంటే కాశ్మీర్ లోను పొత్తులు పెట్టుకోవచ్చని అన్నారు. శుక్రవారం మీడియా చిట్ చాట్ సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. బిజెపి, జనసేన పొత్తుతో తమకేమి సంబందం అని కెటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే అది ఎపికి పరిమితం కాదని పవన్ కళ్యాణ్ అన్న విషయం పై ప్రశ్నించగా,‘‘తెలంగాణ అనే ఏముంది? కశ్మీర్‌లోనూ పవన్‌ పార్టీ పొత్తులు పెట్టుకోవచ్చు.

‘‘అయినా, ఇప్పుడు ఎన్నికలు ఎక్కడ ఉన్నాయి? 2024 వరకూ ఆగాల్సిందే! జనసేన, బీజేపీ మధ్య పొత్తు తెలంగాణకు సంబంధించిన విషయం కాదు. పవన్‌ కల్యాణ్‌ పక్కన బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూర్చున్నారు. అది అక్కడి ప్రజలకు సంబంధించిన విషయం. వాళ్లే ఆలోచించుకుంటారు’’ అని కెటిఆర్ పేర్కొన్నారు.

 

Similar News