నాకు దొంగ దెబ్బ తీయటం రాదు..ఈటెల సంచలన వ్యాఖ్యలు

Update: 2020-01-01 09:11 GMT

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓ సారి ‘గులాబీ జెండాకు’ అసలైన ఓనర్లం తామే అంటూ వ్యాఖ్యానించిన కలకలం రేపారు. అదే సమయంలో తాము పదవులకు ఎవరి దగ్గర చేయి చాపం అంటూ ప్రకటించారు. తాజాగా మరోసారి ఈటెల వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

‘నాకు కొట్లాడటం తెలుసు కానీ దొంగ దెబ్బ తీయటం తెలియదు. నమ్మిన వారు మోసం చేస్తే బాధ కలుగుతుంది. ప్రజలు ధర్మం తప్పరు. నమ్మక ద్రోహం చేసే వారు బాగుపడరు. ప్రజలు ధర్మం తప్పలేదు కాబట్టే నేను గెలిచాను. కోట్ల రూపాయలు ఖర్చు అయినా నేను ఎవరి దగ్గర చేయి చాచలేదు’ అని ఈటెల రాజేందర్ అన్నారు. కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో నెలకొన్న గ్రూపు తగాదాలను దృష్టిలో పెట్టుకునే ఈటెల ఈ వ్యాఖ్యలు చేసినట్లు బావిస్తున్నారు.

 

 

Similar News