వరలక్ష్మి శరత్ కుమార్. హీరోయిన్ గా నటిస్తూనే మరో వైపు నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలు కూడా చేస్తూ సత్తా చాటుతోంది. ఒక్క మాట చెప్పాలంటే వరలక్ష్మి శరత్ కుమార్ తమిళ రమ్యకృష్ణగా పేరుతెచ్చుకుంటోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వరలక్ష్మి తాజాగా రవితేజ సినిమాలో కీలక పాత్ర చేయటానికి అంగీకరించారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో వరలక్ష్మి నటించనున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతిహాసన్ చేయనున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్ లో డాన్శీను', 'బలుపు' వంటి సినిమాలు వచ్చి మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. లైట్ హౌస్ మూవీ మేకర్స్ బ్యానర్పై ఠాగూర్ మధు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. రవితేజ 66వ చిత్రమిది. ఈ కొత్త సినిమాలో కథ, పాత్ర నచ్చడంతో వరలక్ష్మి సినిమాలో నటించడానికి అంగీకరించారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. నవంబర్లో ఈ సినిమా ప్రారంభం కానుంది.