చిదంబరంతో రాహుల్, ప్రియాంక భేటీ

Update: 2019-11-27 06:01 GMT

కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు బుధవారం నాడు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరాన్ని తీహార్ జైలులో కలిశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరెస్ట్ అయి ఆయన జైలు జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా తీహార్ జైలుకు వెళ్లి చిదంబరంతో భేటీ అయి వచ్చారు. ఓ కేసులో చిదంబరానికి బెయిల్ వచ్చినా ఈడీ కేసులో మాత్రం ఊరట లభించలేదు. దీంతో ఆయన తీహార్ జైలులోనే ఉన్నారు.

 

Similar News