మాస్ చిత్రాల కిక్కే వేరు ఉంటుందని ఇప్పుడిప్పుడే అర్ధం అవుతోందని హీరో వరుణ్ తేజ్ వ్యాఖ్యానించారు. వాల్మీకి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వాల్మీకి’ నా 9వ సినిమా. ఇప్పటి వరకూ ప్రయోగాలు, క్లాస్, లవ్స్టోరీలంటూ సినిమాలు చేశాను. ఫస్ట్ టైమ్ ఓ మాస్ సినిమా చేస్తే ఆ కిక్కే వేరప్పా.. మామూలుగా లేదమ్మా. చిరంజీవి ఎప్పుడూ చెబుతుండేవారు.. ‘అరేయ్ మేము మాస్ సినిమాలు ఎందుకు చేస్తామో నీకు అర్థం కావట్లేదు అని’.. ఇప్పుడు ఫైనల్గా ఆ రుచిని కొంచెం చూశా.. థ్యాంక్యూ డాడీ. మా దాహం తీరే సినిమా ఎవరిస్తారు అనుకున్నాం.. హరీష్ ‘గబ్బర్సింగ్’ చూసినప్పుడు ఇదీ సినిమా అనిపించింది. మా బాబాయికి అంతపెద్ద సినిమా ఇచ్చిన ఆయన నాతో చేయడం నా అదృష్టం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన హీరో వెంకటేష్ మాట్లాడుతూ ‘మా కోబ్రా (కో–బ్రదర్. ‘ఎఫ్ 2’ లో వరుణ్ పాత్రను ఉద్దేశించి) లుక్ మొత్తం మార్చేశాడు.. ‘ఎఫ్ 2’ నుంచి ‘వాల్మీకి’ చిత్రానికి గెటప్ మార్చేశాడు.
ఈ ట్రైలర్ చూడగానే టెరిఫిక్గా అనిపించింది. ‘గద్దలకొండ గణేశ్... రచ్చ రచ్చే’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. ‘‘ఆ వాల్మీకి దొంగ.. మంచిగా మారి రామాయణం రాశారు. మరి.. ఈ వాల్మీకి ఏం రాశాడో థియేటర్స్ కు వెళ్లి చూడాలి. నాకు నమ్మకం ఉంది.. మా వరుణ్ రెచ్చిపోయి ఒక సూపర్ బ్లాక్బస్టర్ ఇస్తాడు. నా స్నేహితుడు పవన్ కల్యాణ్కు హరీశ్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ అనే బ్లాక్బస్టర్ సినిమా ఇచ్చాడు. మా వరుణ్కి కూడా సూపర్ హిట్ ఇస్తాడని నమ్మకంగా ఉన్నాను. నిర్మాతలు రామ్, గోపి కలిసి నాతో ‘నమో.. వెంకటేశ’ చేశారు. చాలా ప్యాషన్తో సినిమా చేస్తారు.. కానీ, సింపుల్గా ఉంటారు. ‘వాల్మీకి’ పెద్ద హిట్ అవ్వాలి, మంచి కలెక్షన్స్ రావాలి’’ అన్నారు.