చంద్రబాబు మళ్లీ ఆ తప్పు చేయలేదు

Update: 2019-06-18 07:43 GMT

తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ‘ మళ్లీ ఆ తప్పు చేయలేదు.’. స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఎన్నికైన సమయంలో ఆయన్ను సీటు వరకూ తోడ్కోని వెళ్ళే కార్యక్రమానికి చంద్రబాబు దూరంగా ఉన్నారు. దీనిపై ఆయన సభలోపలా..వెలుపలా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. స్పీకర్ ఎన్నికపై ప్రతిపక్షానికి కనీస సమాచారం ఇవ్వకపోవటంపై అధికార పార్టీ కూడా విమర్శలు ఎదుర్కొంది. అయితే మంగళవారం నాడు మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం కన్పించింది.

ఉప సభాపతిగా కోన రఘుపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఆయన్ను స్పీకర్ స్థానం వద్దకు తోడ్కోని వెళ్ళే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోపాటు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కూడా పాల్గొన్నారు. కోన రఘుపతి ఎన్నిక ప్రకటించిన తర్వాత చంద్రబాబు గతానికి భిన్నంగా కోన రఘుపతిని ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు. ఉపసభాపతికి ఒక్కటే నామినేషన్ దాఖలు కావటంతో స్పీకర్ తమ్మినేని సీతారాం కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు స్పీకర్.

Similar News