యువ హీరో ఆది సాయికుమార్ నటించిన సినిమా ‘బుర్రకథ’ సినిమా విడుదల ఒక రోజు వాయిదా పడింది. వాస్తవానికి ఈ సినిమా శుక్రవారం నాడే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ అయితే సెన్సార్ సర్టిఫికేషన్లో ఇబ్బందులు ఎదురవ్వటంతో సినిమా విడుదల వాయిదా పడింది.
చివరి నిమిషంలో టెన్షన్ ఉండకూడదన్న ఉద్దేశంతో సినిమాను ఒక రోజు ఆలస్యంగా శనివారం (జూన్ 29) రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి, నైరా షాలు హీరోహీరోయిన్లుగా నటించారు. ఈసినిమాతో రచయిత డైమండ్ రత్నబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.