బిజెపి ఎమ్మెల్యేపై పోలీసుల దాడి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. బిజెపి ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తుంటే..పోలీసులు కొత్త వాదన తెరపైకి తెచ్చారు. జుమ్మెరాత్ బజార్లో స్వాతంత్ర్య సమరయోధురాలు రాణి అవంతి భాయ్ విగ్రహాన్ని పెట్టేందుకు రాజాసింగ్ ప్రయత్నించారని వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. అనుమతి లేకుండా విగ్రహం పెట్టడంతో అడ్డుకున్నామన్నారు.
రాజా సింగ్పై తాము ఎలాంటి దాడి చేయలేదని పేర్కొన్నారు. రాజా సింగే తనకు తాను రాయితో కొట్టుకున్నాడని చెప్పారు. దీనికి సంబంధించి వీడియో ఆధారాలు ఉన్నాయని తెలిపారు. పోలీసులపై రాజాసింగ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.